BRICS Summit : బ్రిక్స్ సమావేశాల సందర్భంగా దేశాధినేతలు తమ ఐక్యతను చాటారు. ఉగ్రవాదాన్ని సహించబోమని ప్రకటించిన నాయకులు ఢిల్లీ డిక్లరేషన్ను ఏకగ్రీవంగా ఆమోదించారు. అంతేకాదు తమ అనుబంధం, భాగస్వామ్యం భవిష్యత్లోనూ ఈ విధంగానే కొనసాగాలని ఆకాంక్షిస్తూ మొక్కలు నాటారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ చొరవతో భారత మండపం ఆవరణలో బ్రిక్స్ దేశాలకు చెందిన 11 మంది ప్రతినిధులు ఉత్సాహంగా మర్రి మొక్కలు నాటారు.
న్యూ ఢిల్లీ వేదికగా జరుగుతున్న పద్దెనిమిదో బ్రిక్స్ సదస్సులో ఐక్యతా రాగం వినిపించారు నాయకులు. భవిష్యత్లోనూ ఇదే తరహాలో బ్రిక్స్ దేశాల ఐక్యత, బలమైన అనుబంధం కొనసాగాలని ఆకాంక్షిస్తూ భారత మండపం ఆవరణలో మర్రి మొక్కలు నాటి, నీళ్లు పోశారు.
Prime Minister @narendramodi and BRICS Leaders pose for a Family Photo and participate in a joint tree plantation at Bharat Mandapam.@BricsIndia2026 @MEAIndia #BRICS2026 #BRICSIndia2026 #IndiaBRICSChairship pic.twitter.com/JPfwKjZBJY
— All India Radio News (@airnewsalerts) September 12, 2026
ఫొటో షూట్ అనంతరం నిర్వహించిన ప్లాంటేషన్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధినేత జిన్పింగ్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. మసూద్ పెజెష్కియాన్(ఇరాన్ అధ్యక్షుడు), ప్రబొవో సుబియాంటో(ఇండోనేషియా అధ్యక్షుడు), అబీ అహ్మద్ (ఇథియోపియా ప్రధాని), సిరిల్ రమఫోసా(దక్షిణాఫ్రికా అధ్యక్షుడు), హెచ్.హెచ్.షేక్ ఖలీద్ బిన్ మొహమద్ బిన్ జయెద్ అల్ నహ్యాన్ (యూఏఈ యువరాజు)లు కూడా మర్రి మొక్కలు నాటి నీళ్లు పోశారు.
Swagatam BRICS leaders for the 2026 Summit. pic.twitter.com/SkmO9rV2Kf
— Narendra Modi (@narendramodi) September 12, 2026