న్యూఢిల్లీ : విమాన పైలట్లు, ఇతర సిబ్బంది మౌత్వాష్, పెర్ఫ్యూమ్స్ వాడకంపై డీజీసీఏ నిషేధం విధించనుంది. ఈమేరకు కొత్త నిబంధనావళిని తీసుకొస్తున్నది. మౌత్వాష్, పెర్ఫ్యూమ్స్ల్లో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల పైలట్లు, ఇతర సిబ్బందికి చేసే ‘బ్రీత్ ఎనలైజర్ టెస్ట్’ ప్రభావితమవుతున్నదని డీజీసీఏ భావిస్తున్నది.
‘ ఆల్కహాల్ ఉత్పత్తులు వాడితే బ్రీత్ ఎనలైజర్ టెస్ట్లో పాజిటివ్ రావడానికి ఆస్కారముంది. ఆల్కహాల్తో కూడిన ఔషధాలు వాడేవారు.. ముందస్తుగా అనుమతి పొందాలి’ అని డ్రాఫ్ట్లో డీజీసీఏ పేర్కొన్నది.