న్యూఢిల్లీ: సుమారు 22 ఏళ్ల కిందట తప్పిపోయిన బాలుడు సన్యాసిగా తల్లికి కనిపించాడు. (Boy Returns To Mother As Monk ) ఆమెను భిక్ష అడుక్కొని తిరిగి వెళ్లిపోయాడు. ఈ సంఘటన సినిమాను తలపించింది. 2002లో ఢిల్లీకి చెందిన 11 ఏళ్ల పింకు గోలీలు ఆడటంపై తండ్రి రతీపాల్ సింగ్, తల్లి భానుమతి మందలించారు. దీంతో ఆ బాలుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు అతడి గురించి వెతికినా ఫలితం లేకపోయింది.
కాగా, సన్యాసిగా మారిన పింకు 22 ఏళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్ అమేథీ జిల్లాలోని ఖరౌలి గ్రామంలో కనిపించాడు. సన్యాసి వస్త్రధారణలో ఉన్న అతడు సారంగిని వాయిస్తూ పాటలు పాడుతూ గ్రామస్తులను భిక్ష అడిగాడు. అయితే ఇంటి నుంచి పారిపోయిన పింకూనే ఆ సన్యాసి అని ఆ గ్రామంలో ఉన్న అతడి బంధువులు గుర్తించారు. ఢిల్లీలో ఉన్న తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఆ గ్రామానికి చేరుకున్నారు.
మరోవైపు శరీరంపై ఉన్న మచ్చ ఆధారంగా ఆ సన్యాసిని తప్పిపోయిన పింకూగా తల్లి భానుమతి గుర్తించింది. అయితే తల్లీ, కుమారుడి కలయిక ఎంతోసేపు నిలువలేదు. తల్లి నుంచి భిక్ష స్వీకరిస్తేనే తన సన్యాస జీవితానికి పూర్తి సార్థకత లభిస్తుందని అతడు తెలిపాడు. అందువల్ల దైవ నిర్ణయం వల్లనే తన కుటుంబాన్ని తిరిగి కలుసుకోగలిగినట్లు చెప్పాడు. తల్లి నుంచి భిక్ష తీసుకున్న అతడు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎంత నచ్చజెప్పినా వినకుండా వారిని విడిచి ఆ గ్రామం నుంచి వెళ్లిపోయాడు.
కాగా, తన కుమారుడు పింకూను విడిచిపెట్టేందుకు అతడికి చెందిన మఠం రూ.11 లక్షలు డిమాండ్ చేసినట్లు తండ్రి రతీపాల్ సింగ్ ఆరోపించాడు. తన వద్ద అంత డబ్బు లేదని ఆయన వాపోయాడు.
20 साल बाद जोगी के भेष में भिक्षा मांगने अपने ही घर पहुंचा बेटा, मां ने लिया पहचान।
अमेठी से एक चौंका देने वाला मामला सामने आया है, आपको बता दें कि यहां 20 साल पहले घर से भागा बेटा अचानक जोगी के भेष में अपने घर पहुंचा तो उसे देखकर सब लोग हैरान हो गए।#Amethi #UttarPradesh pic.twitter.com/zaVpWjykmn
— UP Tak (@UPTakOfficial) February 7, 2024