భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఖండ్వాలో పదేండ్ల ముస్లిం బాలుడిని వేధించిన 22 ఏండ్ల వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్యూషన్కు వెళుతున్న అయిదవ తరగతి చదివే బాలుడిని అడ్డగించిన నిందితుడు అతడిని జై శ్రీరాం అనాలని ఒత్తిడి చేయగా బాలుడు మౌనంగా ఉండటంతో అతడి చెంప చెళ్లుమనిపించాడు.
మతవిశ్వాసాలను రెచ్చగొట్టేలా వ్యవహరించిన నిందితుడిపై పంధానా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాలుడు ట్యూషన్కు వెళుతుండగా అజయ్ అలియాస్ రాజు భిల్ అతడిని అడ్డగించి జై శ్రీరాం అనాలని బలవంతం చేయడంతో పాటు దాడికి దిగాడని బాధితుడి తండ్రి ఫిర్యాదు చేశారని ఖండ్వా డీఎస్పీ అనిల్ చౌహాన్ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేశామని అతడిపై చర్యలు చేపడతామని ఆయన చెప్పారు.