Smart Phone |ముంబై, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం ఏ కుటుంబంలో చూసినా అందరూ మొబైల్ ఫోన్లో గంటల పాటు గడిపేస్తున్నారు. అయితే, అవసరాలకు మించి ఫోన్ను అతిగా వాడుతూ చిన్నా, పెద్దా అందరూ సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే వాస్తవాన్ని గుర్తించింది ముంబైకి చెందిన మంజుగుప్తా అనే మహిళ. ఇంట్లో అందరూ ఒకే చోట ఉన్నా.. ఒకరితో మరొకరు మాట్లాడుకోకుండా ఫోన్లలో తల పెట్టుకుని కూర్చొంటున్న సమస్యకు పరిష్కారం చూపాలనుకొన్నది. ఈ మేరకు కుటుంబసభ్యులతో ఒప్పందం చేసుకొని బాండ్ రాయించుకొన్నది. ఇంట్లో ఫోన్ అధిక వాడకంపై షరతులు విధించింది. ఈ మేరకు 50 రూపాయల బాండ్పేపర్పై కొన్ని షరతులు టైప్ చేయించి వారితో సంతకాలు చేయించింది. ఈ బాండ్ పేపర్ను మంజుగుప్తా మేనకోడలు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్గా మారింది.
బాండ్ పేపర్లోని షరతులు..