ముంబై: భీమా కోరెగావ్ కేసులో నిందితుడిగా ఉన్న ప్రొఫెసర్, ఉద్యమకారుడు ఆనంద్ తేల్ తుంబ్డేకు బెయిల్ లభించింది. బాంబే హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఒక లక్ష రూపాయల పూచీకత్తుపై తేల్ తుంబ్డే బెయిల్పై బయటకు వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతించింది.
అయితే, తాము దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని, కాబట్టి బెయిల్ ఆర్డర్పై వారం రోజులు స్టే విధించాలని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కోర్టును అభ్యర్థించింది. దాంతో ఎన్ఐఏ అభ్యర్థన మేరకు బెయిల్ ఆర్డర్పై వారం రోజులు స్టే విధిస్తున్నట్లు బాంబే హైకోర్టు పేర్కొన్నది.