ముంబై: సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలపై చర్యలు తీసుకునేందుకు వీలుగా సవరించిన ఐటీ నిబంధనలు ప్రభుత్వాధికారులకు అపరిమితమైన అధికారాలను ఇస్తున్నాయని బాంబే హైకోర్టు చెప్పింది. ఫేక్ న్యూస్పై దృష్టి సారించేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఉన్నప్పటికీ, ప్రత్యేకంగా ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించింది. మార్గదర్శకాలు, రక్షణలు లేకుండా చేసిన సవరణ వల్ల ప్రభుత్వం ఇంకా దేనినో చేయాలని అనుకుంటున్నట్లు కనిపిస్తున్నదని వ్యాఖ్యానించింది. ఐటీరూల్స్, 2021ని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ 6న సవరించింది.