ముంబై, డిసెంబర్ 19: ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో సామాజిక కార్యకర్త గౌతమ్ నవలఖాకు బాంబే హైకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. అయితే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవడానికి బెయిల్ ఉత్తర్వుల అమలుపై ఆరు వారాల పాటు స్టే విధించాలని ఎన్ఐఏ కోరింది.
స్పందించిన జస్టిస్ ఏఎస్ గడ్కరీ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులపై మూడు వారాల పాటు స్టే విధించింది. ఎల్గార్ పరిషద్ కేసులో నవలఖాను ఎన్ఐఏ 2018, ఆగస్టులో అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆయన హౌస్ అరెస్టులో ఉండేందుకు సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్లో అనుమతించింది. ప్రస్తుతం నవలఖా నవీ ముంబైలో ఉంటున్నారు.