న్యూఢిల్లీ: బోయింగ్ ఇండియా డిఫెన్స్(బీడీఐ) మేనేజింగ్ డైరెక్టర్గా నిఖిల్ జోషి(Nikhil Joshi)ని నియమించినట్లు బోయింగ్ సంస్థ ప్రకటించింది. భారత్లో తమ ఆపరేషన్స్ను మరింత బలోపేతం చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. బోయింగ్ కంపెనీకి చెందిన పలు రకాల విమానాలు, హెలికాప్టర్లను ఇండియా వినియోగిస్తున్న విషయం తెలిసిందే. భారత్ వద్ద 11 సీ-17 విమానాలు, 22 ఏహెచ్-64 అపాచీలు, 15 సీహెచ్-47 చినూక్లు, 12 పీ-8ఐలు, 3 వీవీఐపీ విమానాలు(737 ఫ్రేమ్), రెండు 777 విమానాలు ఉన్నాయి.
బోయింగ్ ఇండియా, సౌత్ ఆసియా ప్రెసిడెంట్ సలిల్ గుప్తాకు నిఖిల్ జోషి రిపోర్టు చేయనున్నారు. బోయింగ్కు చెందిన డిఫెన్స్, స్పేస్, సెక్యూర్టీ, బోయింగ్ గ్లోబల్ సర్వీసెస్తో ఆయన పనిచేయనున్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్ ఇండస్ట్రీలో ఆయనకు 25 ఏళ్ల అనుభవం ఉంది. రెండు దశాబ్ధాల పాటు ఆయన భారత సైనిక దళాల్లో కూడా చేశారు. ఇండియన్ నేవీకి చెందిన ఏవియేషన్ బ్రాంచ్లో పనిచేశారు. బోయింగ్కు కన్నా ముందు ఈటాన్ ఏరోస్పేస్ కంపెనీలోనూ అతను చేశారు.