భోపాల్: మధ్యప్రదేశ్లో దారుణ ఘటన జరిగింది. దార్ జిల్లాలోని శ్యాంపూర్ తాలూకాలోని ఓ బావిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు శవాలై తేలారు. స్థానికులు ఆ ముగ్గురి శవాలను బయటకు తీశారు. ఆ పిల్లల వయసు ఆరు నుంచి రెండేళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. అయితే ఆ బావిలోనే తల్లి కూడా ఉందని, కానీ ఆమె మృతదేహాన్ని ఇంకా గుర్తించలేదని అధికారులు చెప్పారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆ పిల్లల తండ్రి జీవన్ భామ్నియా పక్క ఊరికి వెళ్లినట్లు తెలిసింది. ఊరి నుంచి తిరిగి వచ్చిన తర్వాత పిల్లలు కనిపించకపోవడంతో అతను గాలింపు చేపట్టాడు. అమృత(6), జ్యోతి(4), ప్రీతి(2) అమ్మాయిల శవాలను బావి నుంచి తీశారు. తల్లి రాంజానా మృతదేహం ఇంకా దొరకలేదన్నారు.