కొత్తగూడెం క్రైం, ఏప్రిల్ 17: ఛత్తీస్గఢ్లోని కాంకేర్ అడవుల్లో మంగళవారం మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన 29 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పాటిలింగం బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. మృతుల్లో 15 మంది మహిళలు ఉన్నారని తెలిపారు.
ఘటనా స్థలం నుంచి పెద్ద సంఖ్యలో ఏకే-47లు, ఇన్సాస్ రైఫిళ్లు, ఎస్ఎల్ఆర్, కార్బైన్, 303 రైఫిళ్లు, పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు బస్తర్ రేంజ్లో జరిగిన అతిపెద్ద ఆపరేషన్ ఇదేనన్నారు. ఈ ఎదురు కాల్పుల్లో మరికొంత మంది తీవ్రంగా గాయపడి ఉండొచ్చని, కొందరు మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు.