కోల్కతా : పశ్చిమ బెంగాల్ బీర్భూమ్లో టీఎంసీ నేత హత్యతో సోమవారం అర్ధరాత్రి హింస చెలరేగింది. అల్లరి మూకలు 10-12 ఇండ్ల తలుపులు మూసివేసి నిప్పంటించారు. ఇప్పటి వరకు హింసాత్మక ఘటనలో పది మంది మృతి సజీవ దహనమయ్యారు. బీర్భూమ్ జిల్లా రాంపూర్హాట్లో జరిగిన టీఎంసీ ఉపాధ్యక్షుడి హత్యకు ప్రతీకారంగానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. ఘటన అనంతరం సమాచారం అందుకున్న డీఎంతో పాటు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ హింసలో ఇప్పటివరకు మొత్తం 10 మంది మృత్యువాతపడ్డారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకే ఇంటి నుంచి ఏడుగురి మృతదేహాలను వెలికి తీశారు. బెంగాల్లోని బీర్భూమ్లోని రాంపూర్హాట్లో సోమవారం అర్ధరాత్రి బదుషేక్ స్టేట్ హైవే 50పై వెళ్తున్నాడు. ఇదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులపై బాంబు విసరడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత స్థానిక మెడికల్ కాలేజీకి తరలించగా.. మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పశ్చిమ బెంగాల్లో రాజకీయ హింసాత్మక సంఘటనలు జరుగడం ఇదేం తొలిసారి కాదు. ఇంతకు ముందు జరిగిన అల్లర్లలో కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయారు.