Udhav Thackeray | బీజేపీ నకిలీ హిందుత్వ బుర్ఖా ధరించిందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. శనివారం ముంబైలో జరిగిన భారీ బహిరంగసభలో ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ `మనతో కలిసి ఉన్న పార్టీ (బీజేపీ) నకిలీ హిందుత్వ బుర్ఖా ధరించింది. దేవాలయాల్లో ఘంట మోగించే హిందువుల్లా కాకుండా ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పే హిందువుల్లా ఉండాలని బాలాసాహెబ్ ఠాక్రే మాకు చెప్పేవారు. హిందుత్వకు నేనే కస్టోడియన్ అంటున్నది బీజేపీ.. అప్పుడు మొత్తం శివ సైనికులు ఏమిటి? అని ప్రశ్నించారు.
మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను లక్ష్యంగా చేసుకుని ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు గుప్పించారు.ముంబైలో ఫడ్నవీస్కు స్వేచ్ఛనిస్తానని చెప్పారు. త్యాగాలతో సాధించుకున్న ముంబై.. కాజేయాలని చూసేవారి అంతు తేలుస్తామని ఫడ్నవీస్కు చెబుతున్నా అని అన్నారు.
ఇటీవల కశ్మీర్లోయలో కశ్మీర్ పండిట్ హత్యపైనా ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. `మా హిందుత్వ `గదాధరి` జమ్ముకశ్మీర్లోని తహశీల్ ఆఫీసులో రాహుల్భట్ అనే కశ్మీరీ పండిట్ను ఉగ్రవాదులు హత్య చేశారు. ఇప్పుడు మీరేం (బీజేపీ) ఏం చేస్తారు. అక్కడ హనుమాన్ చాలీసా పఠిస్తారా? అని ప్రశ్నించారు. ఏ ఒక్కరూ ధరల పెరుగుదల మీద మాట్లాడటం లేదు. 25 ఏండ్లపాటు బీజేపీతో పొత్తు పెట్టుకుని మేం సమయం వృధా చేశాం` అని అన్నారు.