న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికలంటే భయపడుతున్నదని ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిశీ (Atishi) ఆరోపించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసును సీబీఐ, ఈడీ గత రెండేళ్లుగా దర్యాప్తు చేస్తున్నప్పటికీ అక్రమాలు జరిగాయడానికి ఒక్క ఆధారం కూడా సేకరించలేకపోయాయని చెప్పారు. ఎన్నికలు సమీపించడంతో కేజ్రీవాల్ను (Arvind Kejriwal) నేరుగా ఎదుర్కోలేక దర్యాప్తు సంస్థలతో అరెస్టు చేయించారని విమర్శించారు. మొదటిసారిగా అధికారంలో ఉన్న ఓ ముఖ్యమంత్రిని కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేయించిందన్నారు. లోక్సభ ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత ఒక పార్టీ జాతీయ కన్వీనర్ను అరెస్టు చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని చెప్పారు. ఇది బీజేపీ రాజకీయ కుట్ర అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
అరవింద్ కేజ్రీవాల్ లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయకూడదని బీజేపీ కోరుకుంటున్నదని, అందుకే ఆయనను అరెస్టు చేశారని ఆరోపించారు. ఇది ఒక పార్టీని కిందిస్థాయి నుంచి దెబ్బతీయడం కాకపోతే మరేంటని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల్లో తాము ఇండియా కూటమితో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించారు. అరవింద్ కేజ్రీవాల్కు కూటమి నాయకులు సంఘీభావం తెలిపారని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల కాలంలో ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్టు చేశారని, ఓ పార్టీ బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారని ఆతిశీ అన్నారు. ఈడీని ఆయుధంగా చేసుకుని రాజకీయాలు చేయడం మానేయాలని బీజేపీకి సూచించారు. తమ పోరాటం వీధుల నుంచి న్యాయస్థానం వరకు సాగుతుందని స్పష్టం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని సుప్రీంకోర్టు పరిరక్షిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. కేజ్రీవాల్ భద్రతపై ఆమె ఆందోళన వ్యక్తంచేశారు.
#WATCH | On Arvind Kejriwal’s arrest, AAP leader & Delhi Minister Atishi says, “It is the first time that a sitting CM has been arrested by Central government. In the country’s history, it is the first time that after the announcement of the Lok Sabha elections, the national… pic.twitter.com/HxaviLfIUU
— ANI (@ANI) March 22, 2024
#WATCH | AAP leader & Delhi Minister Atishi says, “If this is not about damaging a level playing field, then what is it?…We hope that today as well Supreme Court will protect democracy in the country…BJP wants that Arvind Kejriwal should not be able to campaign in Lok Sabha… pic.twitter.com/s7LmTlWtRg
— ANI (@ANI) March 22, 2024