అహ్మాదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కొత్త రికార్డు సృష్టించింది. ఆ రాష్ట్రంలో బీజేపీకి పోలైన ఓట్ల శాతం సరికొత్త మైలురాయిని అందుకున్నది. బీజేపీకి 53.67 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది. 182 స్థానాలు ఉన్న గుజరాత్లో.. బీజేపీ ఇప్పటికే 150 స్థానాల్లో లీడింగ్లో ఉంది. కాంగ్రెస్కు 26.5 శాతం, ఆమ్ ఆద్మీకి 12.9 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం పేర్కొన్నది.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ పోరులోనూ బీజేపీకే ఎక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. కానీ అక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం స్వల్ప తేడాతో కాంగ్రెస్ పార్టీ హిమాచల్లో ఆధిక్యంలో ఉంది. ఆ రాష్ట్రంలో బీజేపీకి 43.5 శాతం ఓట్లు పోలవ్వగా, కాంగ్రెస్ పార్టీకి 42.8 శాతం, ఇతరులకు 11.06 శాతం ఓట్లు పోలయ్యాయి.