BJP | కోల్కతా, మే 25: ఆరో దశ లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ పశ్చిమ బెంగాల్లో కొన్ని ఈవీఎంలకు ‘బీజేపీ’ అని రాసి ఉన్న ట్యాగ్లు ఉండటం వివాదాస్పదంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది. కాగా, ఈ విషయంపై బెంగాల్ ఈసీ వివరణ ఇచ్చారు.
‘పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్లను పెట్టేటప్పుడు అక్కడ ఉన్న అన్ని పార్టీల అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లతో అడ్రస్ ట్యాగ్లపై సంతకాలు చేయిస్తాం. 56, 58, 60, 61, 62 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం, వీవీప్యాట్లు పెట్టేటప్పుడు బీజేపీ అభ్యర్థికి సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు మాత్రమే ఉండటంతో ముందుగా వారి సంతకాలు తీసుకున్నాం. పోలింగ్ జరిగేటప్పుడు మిగతా అందరి ఏజెంట్ల సంతకాలు కూడా పెట్టించాం. ఈ ప్రక్రియలో ఎన్నికల సంఘం నిబంధనలు అన్నీ పాటించాం.’ అని వివరణ ఇచ్చారు.