న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీని మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి 9 గంటలకు ఆయనను అపోలో హాస్పిటల్లో చేర్పించినట్లు సమాచారం. న్యూరాలజీ విభాగం వైద్యులు ఆయనను పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తున్నది. అద్వానీ ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిసింది. ఆయన ఇటీవల అస్వస్థతకు గురికావడంతో ఎయిమ్స్లో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యారు.