లక్నో: ఉత్తరప్రదేశ్లో అధికార బీజేపీకే ప్రజలు మళ్లీ పట్టంకట్టనున్నట్లు తెలుస్తున్నది. అయితే గత అసెంబ్లీ ఎన్నికల కన్నా ఈసారి సీట్లు బాగా తగ్గుతాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. యూపీలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు ఏడు దశల్లో పోలింగ్ జరిగింది. తుది దశ పోలింగ్ సోమవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో సుమారు 232 స్థానాల్లో బీజేపీ, 151 స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ గెలుస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీఎస్పీ, కాంగ్రెస్ పది లోపు స్థానాలకు పరిమితమవుతాయని పేర్కొన్నాయి.
సీఎన్ఎన్ న్యూస్ 18, రిపబ్లిక్ టీవీ, న్యూస్ ఎక్స్ ఛానల్స్లో ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) 211-277 సీట్లు, సమాజ్ వాదీ పార్టీ నేతృత్వంలోని కూటమికి 119-160 స్థానాలు రావచ్చని పేర్కొన్నాయి. బీజేపీ-మిత్రపక్షాలకు 262-277 సీట్లు, ఎస్పీ మిత్రపక్షాలకు 119-134 సీట్లు వస్తాయని సీఎన్ఎన్ న్యూస్ 18 అంచనా వేసింది.