కోల్కతా: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లోని హౌరాలో హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఆందోళనకారులు పోలీస్ వాహనాలు, పోలీస్ బూత్లతో పాటు స్థానిక బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టి ధ్వంసం చేశారు. ధులాగఢ్, పంచ్లా, ఉలుబెరియా వద్ద జాతీయ రహదారి దిగ్బంధాన్ని ఎత్తివేసేందుకు ప్రయత్నించినప్పుడు పోలీసులతో ఆందోళనకారులు ఘర్షణకు దిగారు. పలు చోట్ల రైల్వే పట్టాల వద్ద కూడా నిరసనలు చేశారు. దీంతో పలు రైళ్లను రద్దు చేయగా కొన్నింటిని ఇతర మార్గాల్లో మళ్లించారు.
కాగా, ఆందోళనకారులు బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన సంఘటనకు సంబంధించిన వీడియోను ఆ పార్టీ నేత అనిర్బన్ గంగూలీ ట్వీట్ చేశారు. సీఎం మమతా బెనర్జీ దీనిపై ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు బెంగాల్లో పరిస్థితిని అదుపు చేసేందుకు ఆర్మీని రంగంలోకి దించాలని బీజేపీ డిమాండ్ చేసింది.
Since they listen to her & unfailingly vote for her, West Bengal Chief Minister & Home-Police Minister @MamataOfficial should be able to identify & arrest these rioters/pelters who vandalised & set fire to the BJP office in Howrah rural dist this afternoon. Why is she silent? pic.twitter.com/5WV5TSnrfE
— Dr. Anirban Ganguly (@anirbanganguly) June 10, 2022