న్యూఢిల్లీ: రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ(BJP) విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రాలకు ఇంత వరకు సీఎంలు ఎవరన్న దానిపై క్లారిటీ లేదు. ముఖ్యమంత్రుల విషయాన్ని తేల్చేందుకు ఇవాళ బీజేపీ ముగ్గురు పరిశీలకుల(Observers)ను ప్రకటించింది. బీజేపీ సీనియన్ నేతలు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, అర్జున్ ముండాలను అబ్జర్వర్లుగా ప్రకటించారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల్లో లెజిస్లేటివ్ పార్టీ నేత ఎంపిక విషయంలో ఈ పరిశీలకులు కీలక పాత్ర పోషించనున్నారు. లెజిస్లేటివ్ పార్టీ నేతలే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు కానున్నారు.
కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు పార్టీ నేతలు సరోజ్ పాండే, వినోద్ తవడే.. రాజస్తాన్కు సెంట్రల్ అబ్జర్వర్లుగా వెళ్లనున్నారు. ఇక మధ్యప్రదేశ్కు ఖట్టర్తో పాటు పార్టీ నేతలు కే లక్ష్మణ్, ఆశా లక్రాలు అబ్జర్వర్లుగా వెళ్తారు. చత్తీస్ఘడ్కు అర్జున్ ముండాతో పాటు మరో కేంద్ర మంత్రి సరబానంద సోనావాల్, దుశ్యంత్ కుమార్ గౌతమ్లు సెంట్రల్ అబ్జర్వర్ పాత్ర పోషించనున్నారు.
भारतीय जनता पार्टी के संसदीय बोर्ड ने राजस्थान, मध्य प्रदेश एवं छत्तीसगढ़ में पार्टी विधायक दल के नेता के चुनाव हेतु केंद्रीय पर्यवेक्षकों की नियुक्ति की है। pic.twitter.com/UYv1goanjI
— BJP (@BJP4India) December 8, 2023