కోల్కతా: రాజ్యసభలో శుక్రవారం బీజేపీ ఎంపీ రూపా గంగూలీ చాలా డ్రామా చేశారని టీఎంసీ ఎంపీ డోలా సేన్ విమర్శించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఆరోపణలు చేస్తూ ఏడ్చారని, మహాభారతంలోని ‘ద్రౌపది’ పాత్రలో లాగా చాలా బాగా నటించారని అన్నారు. ఆమె పెద్ద నటి అని అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు.
కాగా, బీర్భూమ్ హింసాకాండపై టీఎంసీ తరుఫున తాము కూడా సభలో నిరసన వ్యక్తం చేయడంతోపాటు నినాదాలు చేసినట్లు టీఎంసీ ఎంపీ డోలా సేన్ తెలిపారు. అయితే పశ్చిమ బెంగాల్ గవర్నర్ మాదిరిగా రాజ్యసభ్య డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రవర్తించారని ఆరోపించారు. బీజేపీ మాదిరిగా వ్యవహరించిన ఆయన సభను 15-20 నిమిషాల పాటు వాయిదా వేశారని విమర్శించారు. ఆయన ఉద్దేశపూర్వకంగానే జీరో అవర్లో రాష్ట్ర సబ్జెక్టును నమోదు చేశారని మండిపడ్డారు. దీనిని తాము ఖండిస్తున్నామని ఆమె అన్నారు.
మరోవైపు పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన రాంపూర్హాట్, బీర్భూమ్ హింసాకాండ కేసును సీబీఐ శుక్రవారం తీసుకుంది. కేసు దర్యాప్తు కోసం సీనియర్ అధికారులు, సీఎఫ్ఎస్ఎల్ నిపుణులతో కూడిన బృందాన్ని ఆయా ప్రాంతాలకు పంపింది.