న్యూఢిల్లీ : మొఘల్ పాలకుడు ఔరంగజేబు దేవాలయాలు ధ్వంసం చేసినందుకు ప్రతీకారంగా ఢిల్లీ బీజేపీ నేత అచల్ శర్మ ఉత్తం నగర్లోని టాయ్లెట్కు ఔరంగజేబు మూత్రాలయ్ అనే పోస్టర్ తగిలించాడు. ఇతర టాయ్లెట్స్పై కూడా ఈ తరహా పోస్టర్లను అతికించాలని ఆయన ప్రజలను కోరారు.
అన్ని టాయ్లెట్లనూ ఔరంగజేబు మూత్రాలయ్ లేదా శౌచాలయ్గా పేర్లు మార్చాలని హిందువులందరికీ తాను విజ్ఞప్తి చేస్తున్నానని అచల్ శర్మ చెప్పారు. జ్ఞాన్వాపి మసీదులో శివ లింగాన్ని ముస్లింలు 400 నుంచి 500 ఏండ్ల వరకూ దాచారని ఆరోపించారు. అన్యాయానికి దీటైన సమాధానం ఇచ్చేలా టాయ్లెట్లకు ఔరంగజేబు పేరు పెట్టానని అన్నారు.
జామా మసీదులోనూ ప్రభుత్వం సోదాలు జరపాలని అక్కడ కూడా హిందూ దేవతా, దేవీ విగ్రహాలు ఉంటాయని శర్మ కోరారు. కాగా, జ్ఞాన్వాపి మసీదులో కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వీడియో సర్వే జరిపి నివేదిక ఇచ్చిన క్రమంలో తిరిగి విచారణ మొదలైంది. మసీదులో లభ్యమైన శివలింగాన్ని సంరక్షించాలని, మసీదులో ప్రార్ధనలకు అనుమతించాలని సర్వోన్నత న్యాయస్ధానం ఆదేశించిన సంగతి తెలిసిందే.