చెన్నై: దేశంలో కరోనా విస్తృతికి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. వారం రోజులుగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో శరవేగంగా విస్తరిస్తున్నది. దాంతో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇవాళ 1.79 లక్షలకు చేరింది. సామాన్యులతోపాటు ఎందరో సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు కరోనా మహమ్మారి బారినపడ్డారు. తాజాగా తమిళనాడుకు చెందిన ప్రముఖ నటి, బీజేపీ మహిళా నాయకురాలు ఖుష్బూకు కరోనా పాజిటివ్ వచ్చింది.
ఈ విషయాన్ని ఖుష్బూ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా సోకడంతో ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు. తొలి రెండు వేవ్ల నుంచి తప్పించుకున్నా చివరికి థర్డ్ వేవ్లో నాకు కరోనా వైరస్ సోకింది. ఆదివారం సాయంత్రం కూడా నెగెటివ్ వచ్చింది. జలుబు బాగా ఉండటంతో ఈ ఉదయం మరోసారి పరీక్షలు చేయించగా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఒంటరిగా ఉన్నా. మరో ఐదు రోజులు నన్ను ఎంటర్టైన్ చేయండి అని కుష్బూ ట్వీట్ చేశారు.