న్యూఢిల్లీ: వారసత్వ రాజకీయాలపై ప్రత్యర్థి పార్టీలకు సుద్దులు చెప్పే బీజేపీ తాను మాత్రం గురివింద నీతిని అవలంబిస్తున్నది. బీజేపీ కర్ణాటక రాష్ట్ర యూనిట్ అధ్యక్షుడిగా మాజీ సీఎం బీఎస్ యెడియూరప్ప కుమారుడు, ఎమ్మెల్యే విజయేంద్ర యెడియూరప్ప(47)ను నియమించింది.
పార్టీపై యెడియూరప్ప ప్రభావం ఇంకా ఉందన్న విషయాన్ని ఈ ఆశ్చర్యకర నియామకం తెలియజేసింది. యెడియూరప్ప పెద్ద కుమారుడు బీవై రాఘవేంద్ర లోక్సభ ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుల తీరును ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.