హైదరాబాద్: గుజరాత్లో బీజేపీ శాసనసభాపక్షం ( BJLP Meet ) సమావేశమైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ తన పదవికి రాజీనామా చేయడంతో.. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోవడం కోసం ఈ శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కేంద్ర పరిశీలకులైన కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషి, బీజేపీ జనరల్ సెక్రెటరీ తరుణ్ చుగ్ సమక్షంలో సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశానికి రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు.
సీఎం పదవి నుంచి వైదొలిగిన విజయ్ రూపానీ, సీఎం రేసులో ముందున్నట్లుగా పేరు ప్రముఖంగా వినిపిస్తున్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ, రేసులో ఉన్న ఇతర నాయకులు అంటే గుజరాత్ మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ సీఆర్ పాటిల్ తదితరులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. గాంధీనగర్లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సమావేశం జరుగుతున్నది.