న్యూఢిల్లీ, అక్టోబర్ 9: శివసేన పార్టీ పేరు, ఎన్నికల గుర్తును ఈసీ స్తంభింపజేయడంపై రాజ్యసభ ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఆదివారం ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఈ చర్య ప్రజాస్వామాన్ని స్తంభింపజేయమేనని పేర్కొన్నారు. ‘విల్లు-బాణం’ ఎన్నికల గుర్తు మాజీ సీఎం ఠాక్రే నేతృత్వంలోని నిజమైన శివసేనదేనని అభిప్రాయపడ్డారు. ‘ఈసీ నిర్ణయం వెనుక బీజేపీ సర్కార్ ఉన్నది. ఈసీ వంటి సంస్థలు ప్రభుత్వం తరపున పనిచేయడం సిగ్గుచేటు’ అని సిబల్ వరుస ట్వీట్లలో ఆగ్రహం వ్యక్తం చేశారు.