Rajya Sabha Elections : కర్నాటకలో రాజ్యసభ ఎన్నికలకు సంబందించి బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో నాలుగు స్ధానాలకు మంగళవారం జరిగిన ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యే ఎస్టీ సోమశేఖర్ క్రాస్ ఓటింగ్కు పాల్పడినట్టు అసెంబ్లీలో బీజేపీ చీఫ్ విప్ దొడ్డనగౌడ జీ పాటిల్ వెల్లడించారు.
కాంగ్రెస్ అభ్యర్ధికి అనుకూలంగా సోమశేఖర్ ఓటు వేశారని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పార్టీ దృష్టిసారిస్తుందని, క్రాస్ ఓటింగ్కు పాల్పడిన బీజేపీ ఎమ్మెల్యేపై కఠిన చర్యలు చేపడుతుందని హెచ్చరించారు. ఆయనపై ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై చర్చలు జరుపుతున్నామని చెప్పారు.
తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, నీటి వనరుల కోసం ఎవరైతే హామీ ఇస్తారో అలాంటి వారికి ఓటు వేస్తానని ఎస్టీ సోమశేఖర్ రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసే ముందు విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. కర్నాటక నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో అజయ్ మాకెన్, సయ్యద్ నసీర్ హుస్సేన్, జీసీ చంద్రశేఖర్ (కాంగ్రెస్) నారాయన్స బందగే (బీజేపీ) కుపేంద్ర రెడ్డి (జేడీఎస్) నిలిచారు.
Read More :
Virat Kohli | లండన్ కేఫ్లో కూతురితో కోహ్లీ.. పిక్స్ వైరల్