Lok Sabha elections : అలనాటి అందాల నటి, మథుర లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి హేమామాలిని తరఫున ఆమె కుమార్తెలు ఇషా డియోల్, అహనా డియోల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మథురలోని పలు పట్టణాల్లో తిరుగుతూ ఈసారి కూడా తమ తల్లికే ఓటువేసి గెలిపించాలని కోరుతున్నారు.
ఈ సందర్భంగా ఇషా డియోల్ మీడియాతో మాట్లాడారు. ఒకప్పటికి, ఇప్పటికి మథుర ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. మథురలో తమ తల్లికి మంచి మద్దతు లభిస్తోందని చెప్పారు. మా తల్లి మరోసారి ఎన్నికల్లో విజయం సాధించి ఇక్కడే ఉండాలని మథుర ప్రజలు కోరుకుంటున్నారని ఇషా తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము మథుర నియోజకవర్గంలోని యువతను కలిసి మాట్లాడామని ఇషా డియోల్ చెప్పారు. ఓటు ప్రాముఖ్యత గురించి ఇక్కడి యువతకు అవగాహన కల్పించామని తెలిపారు.
#WATCH | Uttar Pradesh: BJP candidate from Mathura constituency Hema Malini’s daughters Esha Deol and Ahana Deol visit Mathura.
Actress Esha Deol says, “…This place has developed a lot. The heritage and tourism are maintained and preserved here… There are a lot of supporters… pic.twitter.com/dGNNeyR7TD
— ANI (@ANI) April 20, 2024