లక్నో : కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా పంజా విసురుతున్నది. సాధారణ ప్రజలతోపాటు ప్రముఖులు వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇవాళ ఉత్తర ప్రదేశ్లోని ఆరైయా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సర్దార్ రమేశ్ చంద్ర దివాకర్ (56) కరోనాతో కన్నుమూశారు.
గత నాలుగురోజుల క్రితం కరోనా బారినపడిన ఎమ్మెల్యే చంద్ర దివాకర్ చికిత్స నిమిత్తం దవాఖానలో చేరాయి. రెండురోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.
చికిత్స పొందుతూ ఇవాళ దవాఖానలో మృతి చెందారు. ఎమ్మెల్యే రమేశ్ చంద్ర దివాకర్ మృతి పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇది చాలా బాధకరమైన వార్తని విచారం వ్యక్తంచేశారు. దివాకర్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని సీఎం యోగి ట్విట్ చేశారు.
కాగా ఎమ్మెల్యే రమేశ్ చంద్ర దివాకర్ భార్య సైతం కరోనా బారినపడి కాన్పూర్లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి