న్యూఢిల్లీ: బీజూ జనతా దళ్ ఎంపీ సులతా డియో(MP Sulata Deo)కు ఓ వ్యక్తి బెదిరింపు మెసేజ్లు చేశాడు. మహేంద్ర గ్రూపులో పనిచేస్తున్న సత్యబ్రత నాయక్ అనే వ్యక్తి ఆ మెసేజ్లు చేశాడు. రేప్ చేసి చంపేస్తానని ఆ వ్యక్తి తన సోషల్ మీడియా అకౌంట్లో వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు. దీనిపై ఆనంద్ మహేంద్ర కంపెనీ ఓ ప్రకటన చేసింది. అమర్యాదకర, తప్పుడు ప్రవర్తనను ప్రోత్సహించేది లేదని , వాటి పట్ల జీరో టాలరెన్స్ ఉన్నట్లు ఆ కంపెనీ తన ప్రకటనలో చెప్పింది. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఘటన పట్ల పూర్తి దర్యాప్తునకు ఆదేశించామని పేర్కొన్నది. తమ రూల్స్ ప్రకారం ఆ వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది.
Official Statement pic.twitter.com/JBGa4pNl98
— Mahindra Group (@MahindraRise) August 18, 2025
మహేంద్ర గ్రూపు ఉద్యోగి సత్యబ్రత నాయక్ చేసిన రేప్, చంపడం లాంటి బెదిరింపు మెసేజ్ల స్క్రీన్ షాట్ను బీజేపీ ఎంపీ సులతా డియో తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేశారు. ఫేస్బుక్ ప్రొఫైల్ ప్రకారం బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి మహేంద్ద కంపెని నాసిక్ బ్రాంచ్లో పనిచేస్తున్నాడు. నిందితుడు బీజేపీ వర్కర్ అని డియో ఆరోపించారు. కొందరు పోలీసు ఉన్నతాధికారులు ఫిర్యాదును పట్టించుకోవడం లేదని, ఇంత వరకు ఎటువంటటి చర్యలు తీసుకోలేదని బీజేడీ ఎంపీ సులతా ఆరోపించారు. డియోకు సపోర్టుగా ప్రతిపక్ష నేతలు నిలిచారు.
This is extremely shameful and I condemn this threat as a fellow colleague of Smt Sulata Deo I’d urge the Home Minister @HMOIndia & @GoI_MeitY to take severe action against this violent threat. https://t.co/csEtTu1k6l
— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) August 17, 2025