న్యూఢిల్లీ: హర్యానాలోని నుహ్ జిల్లాలో జరిగిన హింస కేసులో బిట్టు భజరంగి(Bittu Bajrangi)ని పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని ఒక రోజు కస్టడీలోకి తీసుకున్నారు. ఇంతకీ బిట్టు భజరంగీ ఎవరో తెలుసుకుందాం. ఫారిదాబాద్లో గో సంరక్షణ గ్రూపునకు లీడర్గా ఉన్నాడు. బిట్టు భజరంగీని రాజ్కుమార్ అని కూడా పిలుస్తారు. అతనిపై పలు ఆరోపణలు ఉన్నాయి. అల్లర్లు, చోరీలు, బెదిరింపులకు పాల్పడినట్లు కేసులు ఉన్నాయి. గో సంరక్షణ భజరంగ్ ఫోర్స్ పేరుతో ఓ సోషల్ మీడియా గ్రూపును నడుపుతున్నారు. ఆ గ్రూపును జంతు సేవాసమితిగా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. లవ్ జిహాదీపై ఆ గ్రూపు అనేక పోస్టులు చేసింది.
భజరంగ్ దళ నేత మోనూ మనేసర్తో బిట్టు భజరంగ్కు చాలా క్లోజ్ సంబంధాలు ఉన్నాయి. నుహ్లో జరిగిన మత ఘర్షణల్లో బిట్టు రెండవ కీలక నిందితుడు. ఆ రోజు జరిగిన ర్యాలీలో బిట్టు కూడా పాల్గొన్నాడు. తొలుగ ఆగస్టు 4వ తేదీన అరెస్టు చేసి అతన్ని బెయిల్పై రిలీజ్ చేశారు. మళ్లీ మంగవారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ర్యాలీ సమయంలో దాడి కోసం బిట్టు గ్యాంగ్ ఆయుధాలు వాడినట్లు తెలుస్తోంది. ఆ ఆయుధాలను పోలీసులు సీజ్ చేశారు. ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కూడా బిట్టుపై కేసు బుక్ చేశారు.
#WATCH | Nuh district court in Haryana sends Bittu Bajrangi to 1-day police custody.
He was arrested by Nuh Police yesterday after a case was registered against him and 15-20 others. https://t.co/rNnBk4xYmX pic.twitter.com/scBqiQDTca
— ANI (@ANI) August 16, 2023