ముంబై: ముంబైలో దారుణం జరిగింది. బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న ఓ 20 ఏళ్ల కుర్రాడి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. బర్త్డే కోసం ఫ్రెండ్స్ డీజే ఏర్పాటు చేశారు. అయితే ఆ డీజే బిల్లును చెల్లించేందుకు బర్త్డే బాయ్(birthday boy) నిరాకరించాడు. దీంతో వాళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఆ కుర్రాడిని ఫ్రెండ్సే చంపేశారు. కత్తితో అతని ఛాతిలో పొడిచారు. వివరాల్లోకి వెళ్తే..
సాబిర్ అన్సారీ అనే 20 ఏళ్ల కుర్రాడు తన బర్త్డే సందర్భంగా దాబాలో దావత్ ఇచ్చాడు. పది వేలు ఖర్చు పెట్టి ఫుడ్ ఎంజాయ్ చేశారు. అయితే సాబిర్ స్నేహితుడు ఒకరు పార్టీ కోసం డీజీ కిరాయి తీసుకున్నాడని, కానీ తన దగ్గర డబ్బులు లేకపోవడంతో డీజీ కోసం సాబిర్ డబ్బులు ఇవ్వలేదని, దీంతో సాబిర్ను తన స్నేహితులు చంపేసినట్లు బాధితుడి తండ్రి పోలీసులకు తెలిపాడు.
ఈ ఘటన ముంబైలోని గోవండిలో ఉన్న బైగన్వాడి ఏరియాలో గత వారం జరిగింది. ఈ కేసులో షారూక్, నిషార్లను అహ్మాదాబాద్లో అరెస్టు చేశారు. మరో ఇద్దరు మైనర్లను జువెనైల్ హోమ్కు పంపారు. శివాజీనగర్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.