న్యూఢిల్లీ: సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ అంతిమయాత్ర మొదలైంది. ఢిల్లీ కంటోన్మెంట్లో ఉన్న బ్రార్ స్క్వేర్ శ్మశానవాటికలో రావత్కు తుది వీడ్కోలు పలకనున్నారు. అయితే అంత్యక్రియలను పూర్తిగా సైనిక లాంఛనాలతో నిర్వహించారు. ఆ సమయంలో త్రివిధ దళాలు 17 గన్ సెల్యూట్ చేయనున్నాయి. ఇంకా సుమారు 800 మంది త్రివిధదళాలకు చెందిన సిబ్బంది దహన సంస్కారాల్లో పాల్గొనున్నారు. భారీ జన సమూహం మధ్య రావత్ దంపతుల అంతిమయాత్ర సాగుతోంది. ఆర్మీ చీఫ్ ఎంఎన్ నరవాణే, ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరీ, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్లు ఇవాళ రావత్ పార్దీవదేహానికి నివాళి అర్పించారు. శ్రీలంక, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్లకు చెందిన సైనిక కమాండర్లు రావత్ అంత్యక్రియలకు హాజరయ్యారు.