Kiran Mazumdar | కరోనా వ్యాక్సిన్పై కర్నాటక సీఎం సిద్ధ రామయ్య చేసిన వ్యాఖ్యలపై బయోకాన్ ఫౌండర్ కిరణ్ మంజుందార్ ఖండించారు. వాస్తవానికి ఇటీవల కర్నాటకలో గుండెపోటు మరణాలు సంభవించయి. హసన్ జిల్లాలో దాదాపు గత నెలలో 18 మంది గుండెపోటు కారణంగా చనిపోయారు. అయితే, ఈ మరణాలకు కరోనా వ్యాక్సిన్ కారణమని.. వ్యాక్సిన్లను కేంద్రం త్వరగా ఆమోదించిందని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. తొందరపాటుతో ఆమోదించడం పంపిణీ చేయడం కూడా మరణాలకు కారణం కావొచ్చనే విషయాన్ని తిరస్కరించలేమన్నారు. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేయాలని కమిటీని ఏర్పాటు చేసి.. ఆదేశాలు జారీ చేరశారు. ఈ వ్యాఖ్యలపై కిరణ్ మంజుందార్ షా మండిపడ్డారు. సీఎం వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ప్రపంచ స్థాయి ప్రమాణాలతోనే వ్యాక్సిన్లు తయారయ్యాయని.. నిబంధనల ప్రకారం అన్ని వ్యాక్సిన్లు.. అత్యవసర వినియోగానికి అనుమతిని పొందినట్లు చెప్పారు. వ్యాక్సిన్ల లక్షలాది మంది ప్రాణాలను కాపాడాయన్న బయోకాన్ ఫౌండర్.. అలాంటి వాటిపై తప్పుడు ప్రచారం చేయడం ఏమాత్రం సరికాదన్నారు. దుష్ప్రభావాలు చాలా అరుదుగా నమోదయ్యాయన్న ఆమె.. టీకాల దుష్ప్రభావాలు చాలా అరుదుగానే నమోదయ్యాయని.. వ్యాక్సిన్లపై నిందలు ఆపాలని.. వాటి వెనుక ఉన్న విజ్ఞాన శాస్త్రాన్ని గౌరవించాలంటూ సూచించారు. ఇదిలా ఉండగా.. సడెన్ డెత్స్, కొవిడ్ టీకాలకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఐసీఎంఆర్-ఎయిమ్స్ నిర్వహించిన అధ్యయనాల్లో వ్యాక్సిన్లు సురక్షితమైనవేనని, దుష్ప్రభావాలు అరుదుగా గుర్తించినట్లు పేర్కొంది. మరణాలకు జీవనశైలి, ఆరోగ్య సమస్యలే కారణమని స్పష్టం చేసింది.