న్యూఢిల్లీ: స్కూటర్పై ఒక ప్రాంతానికి వచ్చిన దుండగులు ఒక ఇంటిపై పలు రౌండ్లు కాల్పులు జరిపారు. (Assailants Fire At House) స్కూటర్ వెనుక కూర్చొన్న వ్యక్తి రెండు చేతుల్లో ఉన్న రెండు గన్స్తో ఆ ఇంటిపై రెండు వైపులా గాల్లోకి కాల్పులు జరిపాడు. ఇది చూసి స్థానికులు భయాందోళన చెందారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఈ నెల 15న రాత్రి 11 గంటలకు ఇద్దరు వ్యక్తులు స్కూటర్పై యమునా విహార్ ప్రాంతానికి వచ్చారు. బయట నుంచి ఒక ఇంటిపై గన్స్తో పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఇది చూసి ఆ ప్రాంతంలోని వారు భయాందోళన చెందారు.
కాగా, కరోల్ బాగ్లోని బట్టల దుకాణం యజమాని అయిన 52 ఏళ్ల హసినిద్దీన్ సిద్ధిక్ దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్కూటర్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు యమునా విహార్లోని తన ఇంటి వెలుపల పలు రౌండ్లు కాల్పులు జరిపినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఖాళీ బులెట్లు, 7.65 మీమీ లైవ్ రౌండ్ గుండును స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలించారు. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | Delhi: Two men on a two-wheeler fired multiple rounds outside a house in Yamuna Vihar on 15th February. No one was injured. Several empty shells and a live round of 7.65 mm were recovered from the spot. The complainant is being examined for clues. Further investigation… pic.twitter.com/xk1Qa8PvAe
— ANI (@ANI) February 17, 2024