సిమ్లా: భారీ వర్షాలు, వరదలకు హిమాచల్ప్రదేశ్ అతలాకుతలమైంది. సిమ్లాతోపాటు పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో పలు భవనాలు, ఇండ్లు పేకమేడల్లా కూలిపోయాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ దీనిపై స్పందించారు. ప్రధానంగా సిమ్లా విపత్తుపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మేస్త్రీలు, ఆర్కిటెక్ట్లు ఇక్కడ చేపట్టిన నిర్మాణాల్లో శాస్త్రీయ పద్ధతులు అనుసరించలేదని ఆరోపించారు. ‘మాకు స్థానిక మేస్త్రీలు లేరు. బీహారీ ఆర్కిటెక్ట్స్గా నేను పేర్కొనే వలస మేస్త్రీలు (Bihari masons) ఇక్కడకు వచ్చి అంతస్తులపై అంతస్తులు నిర్మించారు’ అని ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అన్నారు.
కాగా, సీఎం సుఖ్విందర్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు. తాను అలా అనలేదని ఏఎన్ఐకు చెప్పారు. బీహార్ ప్రజలు కూడా ఇక్కడ చిక్కుకుపోయారని, వారిని హెలికాప్టర్ల ద్వారా తరలించినట్లు వెల్లడించారు. ‘బీహారీలు మా సోదరులవంటి వారు. వారు కేవలం కూలీలు. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో లోపాలున్నాయి’ అని అన్నారు.
మరోవైపు సిమ్లా పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థతో కూడిన పాత నగరమని సీఎం సుఖ్విందర్ సింగ్ తెలిపారు. ఎలాంటి ప్రమాదాల బారిన పడని ఎత్తైన ప్రభుత్వ భవనాలు దీనికి నిదర్శమని చెప్పారు. అయితే డ్రైనేజీలు లేకుండా, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ ప్రమాణాలకు అనుగుణంగా లేని ఇండ్లు మాత్రమే కుప్పకులాయని అన్నారు. కాగా, భారీ వర్షాలు, వరదల వల్ల హిమాచల్ప్రదేశ్లో భారీగా ఆస్తినష్టం జరిగింది. మృతుల సంఖ్య 70 దాటింది.
#WATCH | Shimla: Himachal Pradesh CM Sukhvinder Singh Sukhu clarifies on his "Bihari architects" comment to Indian Express, he says, "I did not say anything as such. The people of Bihar were also stuck here. I got them evacuated by helicopters. Around 200 people from Bihar are… pic.twitter.com/bJyuDaVrRX
— ANI (@ANI) August 17, 2023
See how vulnerable these hills are. These houses in Shimla just collapsed today like cards. Prayers 🙏🏼 pic.twitter.com/jkR035IEo4
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) August 15, 2023