న్యూఢిల్లీ, ఆగస్టు 19: పౌరులకు ప్రభుత్వం కల్పించాల్సిన విద్య, వైద్యం, పౌష్ఠికాహారం, గృహవసతి లాంటివి కనీస సదుపాయాలేనని, అవి ఉచితాలు కాద ని ప్రముఖ ఆర్థికవేత్త జయతీ ఘోష్ ఉద్ఘాటించారు. వాటిని పొందే హక్కు సంపన్నుల కంటే పేదలకే ఎక్కువగా ఉన్నదని స్పష్టం చేశారు.
‘ఉచితాలు’ అనే మాట వాటిని ఉపయోగించుకొనే పేదల దైన్య స్థితిని తెలియజేస్తున్నదని పేర్కొన్నారు. దేశ ప్రజలకు ఆహారం, విద్య, వైద్యం, వసతి సదుపాయాలను భారత్ సరిగా కల్పించలేకపోయిందన్నారు.