పాట్నా/ ఖాట్మండు: ప్లాస్టిక్ సంచిలో నవజాత శిశువు మృతదేహాన్ని (Newborn Body) నేపాల్కు తరలించిన బీహార్ వ్యక్తిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. శిశువు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. బీహార్కు చెందిన 32 ఏళ్ల హరిశ్చంద్ర కుమార్, నేపాల్లోని మాధేష్ ప్రావిన్స్కు చేరుకున్నాడు. సర్లాహి జిల్లాలోని ఒక ఆలయం వద్ద పోలీసులు అతడ్ని తనిఖీ చేశారు. ఆ వ్యక్తి వద్ద ఉన్న ప్లాస్టిక్ సంచిలో నవజాత శిశువు మృతదేహం ఉండటం చూసి షాక్ అయ్యారు. బొడ్డు తాడుతో ఉన్న మృత శిశువును స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
మరో సంఘటనలో ఎర్రచందనం కలిగిన బీహర్ వ్యక్తిని నేపాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. 22 ఏళ్ల నవావుద్దీన్ చౌదరి శనివారం ఢిల్లీ నుంచి ఖాట్మండుకు బస్సులో చేరుకున్నాడు. భద్రతా సిబ్బంది బస్సులో తనిఖీ చేయగా అతడి వద్ద 580 గ్రాముల ఎర్రచందనం లభించింది. అది నిషేధిత వస్తువు కావడంతో అతడ్ని అరెస్ట్ చేశారు.