Monoj Jha: బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆర్జేడీకి కటీఫ్ చెప్పి మళ్లీ ఎన్డీఏ (NDA) కూటమిలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఆర్జేడీతో విభేధాలే ఇందుకు కారణమని తెలుస్తున్నది. బీహార్ రాజకీయాల్లో ఈ అంశం కలకలం రేపుతున్నది. రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో దీనిపై ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా స్పందించారు. ఈ ప్రచారానికి సీఎం నితీశ్ కుమారే తెరదించాలని అన్నారు. ఆయన మౌనంగా ఉండటం కరెక్ట్ కాదని, బీహార్ ప్రజల మేలు కోరి ఆయన ఈ కన్ఫ్యూజన్కు ఫుల్స్టాప్ పెట్టాలని సూచించారు.
ఆర్జేడీ ఎప్పుడూ ఇలాంటి ఆటలు ఆడలేదని మనోజ్ ఝా వ్యాఖ్యానించారు. కాగా, నితీశ్ కుమార్ ఎన్డీఏ కూటమిలో చేరతాడని ఇంత ప్రచారం జరుగుతున్నా ఆయన మాత్రం పెదవి విప్పడంలేదు. మరోవైపు బీహార్ బీజేపీ నేతలు గిరిరాజ్ సింగ్, సుశీల్ మోదీ మాత్రం నితీశ్తో తాము కలువబోమని చెబుతున్నారు.