పాట్నా, జనవరి 29: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నిర్వహించబోయే బీఆర్ఎస్ మలికేక సభకు తమ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, జనతాదళ్ (యూ) ప్రెసిడెంట్ రాజీవ్ రంజన్సింగ్ అలియాస్ లలన్ను వెళ్లాలని తాను కోరినట్టు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ వెల్లడించారు. కైమూర్ జిల్లా పర్యటనలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘సభకు హాజరుకావాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నన్ను కోరారు. కానీ, ముందస్తు షెడ్యూల్ వలన తీరిక లేకుండా ఉన్నానని చెప్పా. పార్టీ తరపు నుంచి ఎవరినైనా పంపించాలని కేసీఆర్ కోరారు. దీంతో సభకు వెళ్లాలని నేను లలన్ను కోరాను.’ అని తెలిపారు.
తేజస్వీయాదవ్కు కూడా చెప్పాలని కేసీఆర్ ఈ సందర్భంగా తనను కోరారని చెప్పారు. తాను ఇద్దరితోనూ మాట్లాడానని, తేజస్వీయాదవ్, లలన్ ఇద్దరూ హైదరాబాద్ వెళ్తారని నితీశ్కుమార్ స్పష్టంచేశారు. జాతీయస్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత చాటేందుకు తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖమ్మంలో ఇటీవల తొలి ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్మాన్, విజయన్తో పాటు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్, జాతీయ నేతలు హాజరయ్యారు. తాను వివిధ పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఖమ్మం సభకు వెళ్లలేకపోయానని నితీశ్కుమార్ చెప్పారు.