ముంబై : బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన తరపున బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ప్రచారం చేయనున్నారు. సేన నేత ఆదిత్యా ఠాక్రే బుధవారం పట్నాలో తేజస్వి యాదవ్తో భేటీ అయిన అనంతరం ఈ దిశగా సంకేతాలు వెల్లడయ్యాయి.
బీఎంసీ ఎన్నికల్లో ప్రచార ప్రణాళికలతో పాటు 2024 లోక్సభ ఎన్నికల్లో విపక్షాలు బీజేపీని దీటుగా ఎదుర్కొనే వ్యూహాలపైనా వారు సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. శివసేనలో ఏక్నాథ్ షిండే తిరుగుబాటు నేపధ్యంలో చీలిక నెలకొన్న క్రమంలో బీఎంసీ ఎన్నికల్లో పాలక సేన అధికారాన్ని నిలుపుకోవడం సవాల్గా మారింది.
బీఎంసీలో సత్తా చాటేందుకు ముంబైలో నివసిస్తున్న 50 లక్షల మంది యూపీ, బిహార్ ప్రజల ఓట్లు కీలకంగా మారాయి. వీరి ఓట్లను ఆకర్షించేందుకు తేజస్వి యాదవ్ను బీఎంసీ ఎన్నికల ప్రచారానికి రావాల్సిందిగా ఠాక్రే ఆహ్వానించారు.