పాట్నా: ఒక రోజువారీ కూలీకి ఆదాయపు పన్ను (ఐటీ) నోటీస్ వచ్చింది. రూ.37.5 లక్షల పన్ను చెల్లించాలని అందులో ఉంది. దీంతో ఆ వ్యక్తి షాకయ్యాడు. వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్లి మొరపెట్టుకున్నాడు. బీహార్లోని ఖగారియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మఘౌనా గ్రామానికి చెందిన గిరీష్ యాదవ్ రోజువారీ కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నాడు. అతడు రోజుకు రూ.500 సంపాదిస్తున్నాడు. అయితే గిరీష్కు ఇటీవల ఐటీ నోటీస్ వచ్చింది. రూ.37.5 లక్షల ఆదాయపు పన్ను చెల్లించాలని అందులో ఉంది. అతడి పేరుతో పాన్ నంబర్తోపాటు రాజస్థాన్కు చెందిన ఒక కంపెనీకి సంబంధించిన వ్యక్తిగా ఆ నోటీస్లో పేర్కొన్నారు.
మరోవైపు రూ.37.5 లక్షల ఆదాయపు పన్ను నోటీస్ అందుకున్న గిరీష్ యాదవ్ కంగారుపడ్డాడు. ఆ నోటీస్ తీసుకుని అలౌలి పోలీస్ స్టేషన్కు పరుగుతీశాడు. ఢిల్లీలో పని చేసినప్పుడు పాన్ కార్డు కోసం ప్రయత్నించినట్లు తెలిపాడు. అయితే పాన్ కార్డును తాను పొందలేదని చెప్పాడు. ఐటీ నోటీస్లో పేర్కొన్న రాజస్థాన్ కంపెనీ గురించి తనకు తెలియదని, తాను ఎప్పుడూ కూడా రాజస్థాన్కు వెళ్లలేదంటూ వాపోయాడు.
కాగా, ఆ ఐటీ నోటీస్ను పరిశీలించిన పోలీసులు మోసపూరితం కావచ్చని అనుమానించారు. ఫ్రాడ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.