అమరావతి : శ్రీశైల భ్రమరాంభ మల్లిఖార్జున స్వామిని బిహార్(Bihar) రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు(Congress MLAs) బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని కృష్ణదేవారాయ గోపురం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు.
బిహార్కు చెందిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్వామివారికి రుధ్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్జన పూజలు చేసి దర్శించుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యే వంశీకృష్ణ బిహార్ ఎమ్మెల్యేలకు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఎమ్మెల్యేలు బిహారుకు వెళ్లారు.
బిహార్లో ఇటీవల జేడీయూ(JDU), బీజేపీ(BJP) సంకీర్ల ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం శాసనసభలో ఈనెల12 బలనిరూపణ చేసుకుంటుంది. దీంట్లో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేజారి పోకుండా ఉండేందుకు ఆ పార్టీ అధిష్టానం రెండు రోజుల క్రితం వారిని తెలంగాణకు పంపి రిసార్ట్స్లో ఉంచింది.