పాట్నా: 2016 నుంచి రాష్ట్రంలో కల్తీ సారా(Hooch Tragedy) తాగి మృతిచెందిన వారి కుటుంబాలకు 4 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించనున్నట్లు బీహార్ సీఎం నితీశ్ కుమార్(CM Nitish Kumar) తెలిపారు. తాజాగా శుక్రవారం రోజున ఈస్ట్ చంపారన్ జిల్లాలోని మోతిహరిలో నాటు సారా తాగి 26 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో మద్య నిషేధాన్ని ప్రవేశపెట్టిన తర్వాత చోటుచేసుకున్న మరణాలకు ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు చెప్పారు. అయితే మద్య నిషేధానికి అనుకూలంగా ఉన్నట్లు ఆయా కుటుంబాలు లేఖను సమర్పించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆ అమౌంట్ను ఇవ్వనున్నట్లు వెల్లడించారు.