పాట్నా, అక్టోబర్ 20: నకలు చిట్టీని లవ్ లెటర్ అనుకొని ఓ బాలుడిని ముక్కలు ముక్కలుగా నరికారు ఓ బాలిక సోదరులు. ఈ దారుణ ఘటన బీహార్లోని భోజ్పూర్లో గత వారం చోటుచేసుకొన్నది. బాలుడు (12) ఐదో తరగతి, అతడి సోదరి ఆరో తరగతి చదువుతున్నారు. వారిద్దరు కలిసి పాఠశాలలో అర్ధవార్షిక పరీక్షలకు హాజరయ్యారు. తన సోదరికి సాయం చేద్దామనుకొన్న ఆ బాలుడు నకలు చిట్టీలు పెట్టుకొచ్చాడు. పరీక్ష జరుగుతుండగానే చిట్టీని ఆమె వైపు విసిరాడు.
ఆ చిట్టీ వేరే అమ్మాయి వద్ద పడటంతో, అది లవ్ లెటర్ అనుకొని ఆమె తన సోదరుడికి ఫిర్యాదు చేసింది. దీంతో ఆ బాలిక సోదరుడు, స్నేహితులు కలిసి బాలుడిని దారుణంగా చితకబాదారు. బాలుడి సోదరి జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పింది. వాళ్లు అతడి కోసం వెతకటం ప్రారంభించారు. ఆలోగా బాలుడిని తీసుకెళ్లిన నిందితులు.. ముక్కలుగా నరికేశారు. సోమవారం గ్రామంలోని గుడి వద్ద ఓ వ్యక్తి చేతిని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాళ్లు మిగతా శరీరం కోసం వెతకగా, మహత్బనియా హాల్ట్ స్టేషన్ వద్ద రైల్వే ట్రాక్ పక్కన శరీర భాగాలు కనిపించాయి. తల్లిదండ్రులను పిలిపించి ఆ మృతదేహం బాలుడిదేనని పోలీసులు నిర్ధారించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వారంతా మైనర్లేనని, జువైనల్ హోమ్కు తరలిస్తామని పేర్కొన్నారు.