Digital Beggar | మీరు ఏదైనా ఊరికి వెళ్తున్నారనుకోండి. రైల్వే స్టేషన్కో, బస్టాండ్కో వెళ్లారు అనుకోండి. అక్కడ చాలామంది బెగ్గర్లను చూసి ఉంటారు. వాళ్లు వచ్చి అయ్యా.. ధర్మం అని అడిగితే.. జేబులో చిల్లర కోసం వెతికి మరీ.. చిల్లర ఉంటే ఇస్తారు. లేకుంటే చిల్లర లేదు అంటాడు. అంతే కదా. సాధారణంగా అందరి విషయాల్లో జరిగేది ఇదే. అందుకే.. ఓ బెగ్గర్ స్మార్ట్గా ఆలోచించాడు. చిల్లర లేదు.. గిల్లర లేదు.. డబ్బులు లేవు.. అని భిక్షం వేయకుండా తప్పించుకోకుండా ఉండేవాళ్లకు చెక్ పెట్టాడు.
బీహార్కు చెందిన 40 ఏళ్ల రాజు పటేల్ గురించే మనం మాట్లాడుకునేది. బెట్టియా రైల్వేస్టేషనే ఆయన అడ్డా. చిన్నప్పటి నుంచి అదే ప్లేస్లో భిక్షాటన చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు రాజు పటేల్.
కొన్నేళ్ల వరకు మనోడికి ఎటువంటి లోటు లేదు. రైల్వేస్టేషన్లో అంతో ఇంతో భిక్షం వస్తే.. దానితో పొట్ట నింపుకొని అక్కడే నిద్రపోయేవాడు. కానీ.. ఇప్పుడు జనరేషన్ మారింది కదా.. అందరూ స్మార్ట్ఫోన్లు, డిజిటల్ వాలెట్స్ వినియోగిస్తున్నారు. దీంతో చాలామంది చిల్లర లేదు.. జేబులో డబ్బు లేదు అంటూ చెప్పి తప్పించుకుంటున్నారు. దీంతో అతడికి రోజు గడవడం కష్టంగా మారింది.
ఆ కష్టం నుంచి వచ్చిందే ఈ ఆలోచన. దాని కోసమే ఏకంగా రాజు పటేల్ ఒక క్యూఆర్ కోడ్ను సపరేట్గా తయారు చేయించుకొని దానికి బ్యాంక్ అకౌంట్ను లింక్ చేయించుకున్నాడు. ఎవరైనా చేంజ్ లేదు.. డబ్బులు లేవు అంటే.. వెంటనే తన మెడలో ఉన్న క్యూఆర్ కోడ్ కార్డును చూపిస్తాడు రాజు. దీంతో చాలామంది ఇప్పుడు ఆన్లైన్ ద్వారా అతడికి భిక్షం వేస్తున్నారట.
మీకు ఇంకో విషయం తెలుసా? రాజు పటేల్.. ప్రధాని మోదీ ఫాలోవర్ అట. మోదీ మన్ కీ బాత్ను ఖచ్చితంగా వింటాడట. నేను డిజిటల్ పేమెంట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తా. నేను నా చిన్నతనం నుంచి బెగ్గింగ్ చేస్తున్నా. ఇది డిజిటల్ ఏజ్ కాబట్టి.. భిక్షం అడుక్కునే విధానాన్ని మార్చుకున్నా.. ఇప్పుడు నాకు కడుపునిండా భోజనం దొరుకుతోంది. రాత్రి పూట స్టేషన్లోనే పడుకుంటా. నాకు బతకడానికి ఇంకే దారి దొరకలేదు.. అంటూ రాజు పటేల్ చెప్పుకొచ్చాడు.