పట్నా: బీహార్లోని భాగల్పూర్లో సోమవారం మధ్యాహ్నం ఓ కుటుంబంపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఒక్కసారిగా కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. కుటుంబంలోని నలుగురిని తీవ్రంగా కొట్టారు. తుపాకీతో కాల్పులు కూడా జరిపారు. దాంతో క్షతగాత్రుల్లో ఒకరికి తూటా గాయం అయ్యింది.
గొడవ గురించిన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, తమ కుటుంబంపై దాడి వెనుక స్థానిక జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్, అతని కుమారుడి హస్తం ఉన్నదని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.