INSACOG | కొవిడ్-19 సబ్ వేరియంట్ జేఎన్.1 దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్నది. దేశంలో ఇప్పటి వరకు 196 జేఎన్.1 వేరియంట్ కేసులు నమోదైనట్లు ఇండియన్ సార్స్ కోవ్ 2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) పేర్కొంది. ఇప్పటి వరకు పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ల విస్తరించిందని పేర్కొంది. తాజాగా ఒడిశాలో కొత్త కేసు నమోదైంది. జేఎన్.1 వేరియంట్ వేగంగా విస్తరిస్తుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఇదిలా ఉండగా.. కరోనా కేసులు సైతం భారత్లో పెరుగుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 636 కొత్త కేసులు రికార్డయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,394కి చేరింది. వైరస్ కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారితో దేశంలో మరణాల సంఖ్య 5,33,364కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా నుంచి 4,44,76,150 మంది కోలుకున్నారు.