స్థానిక సంస్థల ఎన్నికలు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను దెబ్బ తీశాయి. ఎనిమిదేళ్ల పాటు ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన ఖైబర్ పక్తూన్ఖ్వా ప్రావిన్స్లోనే ఇమ్రాన్కు ఎదురు దెబ్బ తగలడం విశేషం. పెరిగిన ధరలు, నిరుద్యోగం లాంటి సమస్యల విషయంలో ప్రజలు విసుగెత్తి, ఇమ్రాన్కు ఝలక్ ఇచ్చారని మీడియా పేర్కొంటోంది. పెజావర్ మేయర్ పదవి కోసం జరిగిన ఈ ఎన్నికల్లో విపక్ష పార్టీ అయిన జమియత్ ఉలేమా ఏ ఇస్లామ్ విజయం సాధించినట్లు తెలుస్తోంది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి కూడా దగ్గరైనట్లు పాక్ మీడియా పేర్కొంది.. ప్రతిపక్ష పార్టీలకు 21 స్థానాలు వస్తే, ఇమ్రాన్ నేతృత్వంలోని పీటీఐ మాత్రం కేవలం 6 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అయితే ఓట్ల లెక్కింపు మాత్రం ఇంకా కొనసాగుతోందని అధికారులు పేర్కొంటున్నారు. ఇక ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి పతనం ఖాయమైనట్లేనని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి.
ఓటమిపై స్పందించిన ఇమ్రాన్ ఖాన్
తాము తప్పులు చేశామని, దానికి తగ్గ మూల్యాన్ని చెల్లించుకున్నామని ప్రధాని ఇమ్రాన్ ట్వీట్ చేశారు. సరైన అభ్యర్థులను రంగంలోకి దించలేదని, అందుకే ఈ ఓటమి అని ఆయన పేర్కొన్నారు. రెండో దశ ఎన్నికల్లో మాత్రం పూర్తిగా దృష్టి నిలుపుతామని, అత్యధిక సీట్లను కైవసం చేసుకుంటామని ఇమ్రాన్ ధీమా వ్యక్తం చేశారు.