న్యూఢిల్లీ : భోపాల్ బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్కు మరోసారి బెదిరింపు కాల్ వచ్చింది. శుక్రవారం రాత్రి వాట్సాప్ కాల్లో ఓ వ్యక్తి ఆమెకు ప్రాణ హాని తలపెడతామని బెదిరించాడు. తాను ఇక్బాల్ కస్కర్ తరపు మనిషినని చెప్పుకున్న వ్యక్తి త్వరలో మిమ్మల్ని చంపేస్తామని, ఈ విషయం మీకు చెబుతున్నామని హెచ్చరించాడు.
వీడియో రికార్డింగ్ ద్వారా వాట్సాప్ కాల్ను రికార్డు చేసిన సాధ్వి ప్రగ్యా దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాధ్వి ప్రగ్యాకు బెదిరింపు కాల్ వచ్చిందని గత రాత్రి రెండు గంటల ప్రాంతంలో ఆమె సిబ్బంది నుంచి సమాచారం వచ్చిందని టీటీ నగర్ పోలీస్స్టేసన్ ఇన్చార్జ్ చయన్ సింగ్ రఘువంశీ తెలిపారు.
ఈ బెదిరింపు కాల్కు సంబంధించిన వీడియో రికార్డింగ్ను ఎంపీ కార్యాలయ సిబ్బంది పోలీసులకు అందించారు. వీడియో రికార్డింగ్ను పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఎంపీ సాధ్వి ప్రగ్యా సింగ్కు గతంలోనూ పలు నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్, మెసేజ్లు వచ్చాయి.